end

ఆహా(AHA) ఓటీటీ లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’

ఇటీవల బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ త్వరలో ఓటీటీ(OTT) ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శనకు సిద్దమైంది. థియేటర్లలో ఫిబ్రవరి 18న విడుదలైందీ చిత్రం. చిత్ర నిర్మాణ సంస్త గీతా ఆర్ట్స్‌ ఈ సందర్భంగా ప్రకటించింది. ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 22న ‘ఆహా’ (AHA) డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీరా పరదేశి జంటగా నటించగా బాక్సాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్‌ పలు నేపథ్యాల మిళితంగా తెరకెక్కించారు. శుభ‌లేఖ సుధాక‌ర్‌(Shubaleka Sudhakar), ముర‌ళీ శ‌ర్మ‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version