end
=
Monday, February 23, 2026
వార్తలురాష్ట్రీయంనేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
- Advertisment -

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రాష్ట్రాభివృద్ధికి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును(Polavaram project) అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడం, నాణ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా ఆయన ఇవాళ పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నేరుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాలను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్–1, గ్యాప్–2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్ పనులు, గతంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు.

ఈ పనులు ప్రాజెక్టు భద్రత, భవిష్యత్ నిలకడకు ఎంత కీలకమో దృష్టిలో పెట్టుకుని, పనుల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తన పర్యటన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమైన సమీక్ష సమావేశాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు మొత్తం పురోగతి, ఇప్పటివరకు ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి తీసుకుంటున్న పరిష్కారాలు, అలాగే కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. భవిష్యత్తులో పనులు ఎలాంటి గడువుల్లో పూర్తి చేయాలి, ఏ దశలో ఏ లక్ష్యాలను సాధించాలి అనే విషయాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులు సుమారు 88 శాతం మేర పూర్తైనట్లు అధికారులు నివేదిస్తున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే సీఎం ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. అధికారులతో సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పర్యటనలో పరిశీలించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. పోలవరం పర్యటన ముగిసిన తర్వాత ఆయన రాజమహేంద్రవరం నుంచి నేరుగా ఢిల్లీకి ప్రయాణం చేయనున్నారు. ఈ పర్యటన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పనులకు కొత్త ఊపునిస్తుందని రాజకీయ, పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -