end
=
Wednesday, February 11, 2026
వార్తలురాష్ట్రీయంజిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- Advertisment -

జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisment -
- Advertisment -

Telangana : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్(District Collectorate) పరిమితిలో తెలంగాణ తల్లి విగ్రహాలను (Telangana thalli statues) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అధికారికంగా ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను ఆధారంగా తీసుకుని మొత్తం 33 జిల్లాల్లో ఒకే శైలిలో ఈ ప్రతిష్టాత్మక విగ్రహాలను ప్రతిష్టించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, సీఎం రేవంత్ వీటిని వర్చువల్‌గా ఆవిష్కరించడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం మొత్తం రూ.5.80 కోట్ల నిధులను కేటాయించింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు, తెలంగాణ తల్లి రూపాన్ని పల్లెటూరి సాంప్రదాయ మహిళా రైతురాలిగా తీర్చిదిద్దారు. ఆకుపచ్చ చీరకు పసుపు రంగు అంచు, నుదుటిపై ఎర్ర బొట్టు, కాళ్లలో కడియాలు, ముక్కుపుడక, సంప్రదాయ మట్టి గాజులు ఇవన్నీ విగ్రహానికి గ్రామీణ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా జాగ్రత్తగా అలంకరించారు.

అదనంగా, గుండు పూసలతో చేసిన హారం తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నంగా నిలబడేలా అమర్చారు. ఎడమ చేతిలో ప్రాంతీయ పంటలు అయిన మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులను పట్టుకుని చిరునవ్వుతో నిలిచిన రూపంలో ఈ విగ్రహం నిర్మించబడింది. విగ్రహం మొత్తం ఎత్తు 18 అడుగులుగా నిర్ణయించబడింది. అందులో 12 అడుగుల విగ్రహం కాగా, 6 అడుగుల ఎత్తులో ప్రత్యేక దిమ్మె నిర్మించారు. ప్రతి విగ్రహం తయారీకి సుమారు రూ.17.50 లక్షలు వెచ్చించారు. జిల్లాల వారీగా ఒకే రకం డిజైన్‌తో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం మొత్తం ఒకే సంస్కృతి మూలాలను ప్రతిబింబించాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టమైంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఆవిష్కరించడం ఇటివరకు లేని విధంగా ఒక చారిత్రక సంఘటనగా నిలుస్తోంది.

కొత్త తెలంగాణ గుర్తింపును ప్రపంచ వేదికపై పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ విగ్రహాలు కీలకపాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, పై ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీని “తెలంగాణ తల్లి దినోత్సవం”గా విశేషంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఈరోజు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల కలెక్టరేట్ కేంద్రాలు ఈ విగ్రహాలతో మరింత ప్రజా ఆకర్షణీయంగా మారాయి. ప్రజలు, ప్రత్యేకించి మహిళా రైతులు, ఈ ప్రతిమతో భావోద్వేగంగా అనుబంధం కలుపుకుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి, భాషాకి, మట్టికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహాల ఆవిష్కరణ రాష్ట్ర చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టంగా నమోదు కానుంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -