మృతుల కుటుంబాలకు మరింత సాయం
ప్రకటించిన టాటా సన్స్ గ్రూప్
గుజరాత్లోని అహ్మదాబాద్(Ahmedabad City)లో గురువారం జరిగిన విమాన ప్రమాదం(Flight Accident)లో 270 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా యాజమాన్యమైన(Air India company) టాటా సన్స్ గ్రూప్(TATA sons groups) ఇప్పటికే రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. ఆ పరిహారం కాక మరో రూ.25 లక్షల మధ్యంతర పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. “ఎయిర్ ఇండియా ప్రతినిధులు అహ్మదాబాద్లోనే ఉంటున్నారు.
మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అవసరమై సేవలు అందిస్తున్నాం. ఆయా కుటుంబాలు తిరిగి కోలుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాం’ అని ఎయిర్ ఇండియా సీఈఓ కాంబెల్ విల్సన్ తెలిపారు. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వీరు కాక ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులతో సహా మరో 29 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
వారి మృతదేహాలను గుర్తించేందుకు ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఒక్కో మృతదేహాన్ని, శకలాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించేందుకు కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో కేంద్రం ఉన్నత స్థాయి, క్రమశిక్షణా కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది.