end
=
Wednesday, February 11, 2026
క్రీడలుగచ్చిబౌలి వేదికగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కీర్తి ఘట్టం
- Advertisment -

గచ్చిబౌలి వేదికగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కీర్తి ఘట్టం

- Advertisment -
- Advertisment -

ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు..డాక్టర్ సోనీ బాలాదేవి
బ్యాడ్మింటన్ క్రీడలు అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది..డాక్టర్ పుల్లెల గోపిచంద్

Hyderabad : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న ప్రోత్సాహక విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతీ ప్రతిభావంతుడికి అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి టోర్నమెంట్‌లు యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి అని పేర్కొన్నారు.

జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ డాక్టర్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, కోచ్‌లు చేస్తున్న కృషి వల్ల క్రీడాకారులు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ నుంచి మరిన్ని స్టార్ ప్లేయర్లు వెలుగులోకి వస్తారు.అని అన్నారు. ఈ సందర్భంగా విజేతలైన భారతీయ మరియు విదేశీ క్రీడాకారులు తమ అనుభవాలను పంచుకున్నారు. నిర్వాహకులు రాష్ట్ర క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, కోచ్‌లు, జాతీయ స్థాయి అంపైర్లు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరై పోటీలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ కాలేరు సురేష్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు యువిఎన్ బాబు, కే వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో క్యాప్షన్:
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, పక్కన జాతీయ చీఫ్ కోచ్ డాక్టర్ పుల్లెల గోపిచంద్.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -