AI Plan Free: టెక్ దిగ్గజం గూగుల్(Google) మరియు దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) మధ్య భారీ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం భారత ప్రజలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (Artificial Intelligence)సేవలను అందుబాటులోకి తెచ్చడం. భాగస్వామ్యం ప్రకారం, అర్హులైన జియో వినియోగదారులు 18 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను ఉచితంగా పొందగలరు. ఈ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ (ట్విట్టర్)లో హర్షం వ్యక్తం చేశారు. రిలయన్స్ జియోతో భాగస్వామ్యం ఎంతో సంతోషంగా ఉంది. అర్హులైన జియో వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జెమినీ 2.5 ప్రో, 2 టెరాబైట్ స్టోరేజ్, అలాగే మా అత్యాధునిక ఏఐ టూల్స్ అందుబాటులో ఉంటాయి. కలిసే మనం ఏం సాధించగలమో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆఫర్ విలువ సుమారు రూ.35,100 ఉంటుంది. ఇందులో యూజర్లు గూగుల్ అత్యంత శక్తివంతమైన జెమినీ 2.5 ప్రో మోడల్తోపాటు నానో బనానా, వియో 3.1 మోడల్స్ ద్వారా చిత్రాలు, వీడియోలను సృష్టించుకునే అవకాశం పొందుతారు. అదనంగా, నోట్బుక్ ఎల్ఎమ్, 2 టెరాబైట్ క్లౌడ్ స్టోరేజ్ వంటి సేవలు కూడా యూజర్లకు లభిస్తాయి. అర్హత పొందిన వినియోగదారులు మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాథమిక దశలో ఈ సేవలు 18 25 ఏళ్ల వయస్సు గల, అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ కలిగిన యువతకు అందించబడ్డాయి. కంపెనీ త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జియో కస్టమర్లకు దీన్ని విస్తరించనుంది.
ఈ భాగస్వామ్యం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే రిలయన్స్ దార్శనికతకు అనుగుణంగా ఉంది. రిలయన్స్ తన ఆధునిక కంప్యూటింగ్ సామర్థ్యాల కోసం గూగుల్ క్లౌడ్ టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) ను వినియోగించనుంది. ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపినట్లుగా, ఈ ఒప్పందం భారతాన్ని గ్లోబల్ ఏఐ పవర్హౌస్గా మార్చడానికి సహాయపడుతుంది. లయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..145 కోట్ల మంది భారతీయులకు ఏఐ సేవలను అందించడం రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యం. గూగుల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్యంతో, భారత్ను కేవలం ‘ఏఐ ఎనేబుల్డ్’ దేశంగా కాకుండా ‘ఏఐ ఎంపవర్డ్’ దేశంగా మార్చాలనుకుంటున్నాం అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత యువత, పరిశోధకులు, టెక్ నిపుణులకు అధునాతన ఏఐ టూల్స్ సులభంగా లభించడం, దేశంలో టెక్నాలజీ పరిణామాలను కొత్త దిశగా తీర్చే అవకాశాన్ని అందిస్తోంది.

