end
=
Sunday, June 15, 2025
రాజకీయంసిట్​ విచారణకు ఏ1 నిందితుడు ప్రభాకర్​రావు
- Advertisment -

సిట్​ విచారణకు ఏ1 నిందితుడు ప్రభాకర్​రావు

- Advertisment -
- Advertisment -

14 నెలలుగా అమెరికాలోనే..
సిట్​ నోటీసులు ఇచ్చినా స్పందన కరువు
పాస్​పోర్ట్​ రద్దు చేయించడంతో దిగి వచ్చిన వైనం..
సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ ట్రావెల్​ డాక్యుమెంట్​తో హైదరాబాద్ కు..

ఫోన్​ట్యాపింగ్​ కేసు(Phone taping case)లో ఏ1 నిందితుడైన ప్రభాకర్​రావు(Prabhakar Rao) ఎట్టకేలకు సిట్​ విచారణకు హాజరయ్యారు. 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ఆయన తిరిగి హైదరాబాద్​కు వచ్చారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్(SIB chief)​గా సేవలందించిన ఆయన్నుసిట్​ అధికారులు ఫోన్​ట్యాపింగ్​ కేసులో ఏ1 నిందితుడిగా చేర్చారు. నాడు ప్రభాకర్​రావు కనుసన్నల్లోనే రాధాకిషన్​రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి కొందరు

పోలీస్​ అధికారులు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాప్​ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక ఫోన్​ ట్యాపింగ్​పై ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigation Team) (సిట్​)ను నియమించింది. ఈ క్రమంలోనే ప్రభాకర్​రావు విజిటింగ్​ వీసాపై అమెరికా వెళ్లారు. విచారణకు హాజరు కావాలని సిట్​ అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్​ అధికారులు ఆయన పాస్​పోర్ట్​ను రద్దు చేయించారు. చివరకు సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ ట్రావెల్​ డాక్యుమెంట్​ జారీ చేయడంతో ఆయన హైదరాబాద్​కు తిరుగు పయనమయ్యారు.

ఆదివారం రాత్రి 8 గంటలకు ఆయన శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ప్రభాకర్​రావు స్వస్థలం నీరుకొల్లు..
ప్రభాకర్​రావు స్వస్థలం ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకొల్లు గ్రామం. ఖమ్మం, వరంగల్​ పోలీస్​ కమిషనరేట్లు కాకముందు ఆయన వరంగల్​ డీఐజీగా సేవలందించారు.

కీలక అంశాలు బయటకొచ్చే అవకాశం..
ఫోన్​ట్యాపింగ్​ కేసులో ఏ1 నిందితుడైన ప్రభాకర్​రావును విచారిస్తే అనేక కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీస్​, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్​ట్యాపింగ్​ చేశారు? జర్నలిస్టులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తల ఫోన్లు ట్యాప్​ నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే ఎవరెవరి ఫోన్లు ట్యాప్​ చేశారు? అన్న కోణంలో సిట్​ అధికారులు విచారిస్తారని సమాచారం.

బీఆర్​ఎస్​కు చిక్కులు
కాళేశ్వరం కుంగుబాటు, నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే నాటి సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, నాటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​రావు పీసీ ఘోష్​ కమీషన్​ నుంచి నోటీసులు అందుకున్నారు. ఈ అంశంలో ఇద్దరూ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. సోమవారం హరీశ్​రావు కమిషన్​ ఎదుట విచారణకు హాజరయ్యారు. 11న కేసీఆర్​ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. మరోవైపు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కూడా ఈ ఫార్ములా కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్నారు.

ఇది ఇలా ఉండగా ఫోన్​ ట్యాపింగ్​ కేసులో తాజాగా ఏ1 నిందితుడు ప్రభాకర్​రావు సిట్ ఎదుటకు హాజరయ్యారు. వరుస పరిణామాలతో బీఆర్​ఎస్​ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలిసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -