end
=
Friday, February 27, 2026
వార్తలురాష్ట్రీయంత్వరలో కొత్త చిరునామాకు ప్రధాని కార్యాలయం
- Advertisment -

త్వరలో కొత్త చిరునామాకు ప్రధాని కార్యాలయం

- Advertisment -
- Advertisment -

Narendra Modi: భారత ప్రధాని కార్యాలయం(Prime Minister Office) (పీఎంవో) చరిత్రలో కీలకమైన మార్పుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ(Delhi)లోని సౌత్ బ్లాక్ నుంచే పనిచేస్తున్న పీఎంవో దాదాపు 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన చిరునామా(address)ను మార్చుకోనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, జనవరి 14 తర్వాత మకర సంక్రాంతి అనంతరం ప్రధాని కొత్త కార్యాలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్పు పరిపాలనా వ్యవస్థలోనే కాకుండా దేశ చరిత్రలోనూ ఒక మైలురాయిగా భావిస్తున్నారు.

రాయ్‌సీనా హిల్స్‌కు సమీపంలోని దారా షికో రోడ్డులో నిర్మించిన ఈ కొత్త భవన సముదాయానికి ప్రభుత్వం ‘సేవా తీర్థ్’ అనే పేరు పెట్టింది. ప్రజాసేవే పాలనలో ప్రధాన లక్ష్యమని చాటిచెప్పేందుకే ఈ నామకరణం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఈ సముదాయంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ‘సేవా తీర్థ్–1’ను ప్రధాని కార్యాలయానికి, ‘సేవా తీర్థ్–2’ను కేబినెట్ సెక్రటేరియట్‌కు, ‘సేవా తీర్థ్–3’ను జాతీయ భద్రతా మండలి కార్యదర్శిత్వం (NSCS)కు కేటాయించారు. ఇందులో ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్ గత ఏడాది సెప్టెంబర్‌లోనే తన కార్యకలాపాలను కొత్త భవనానికి తరలించింది. ఇప్పుడు పీఎంవో తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) పర్యవేక్షణలో లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ సుమారు రూ.1,189 కోట్ల వ్యయంతో కేవలం 24 నెలల్లో ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసింది.

ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి వంటి అత్యంత కీలక సంస్థలు ఒకేచోట ఉండటం వల్ల పరిపాలనా సమన్వయం మరింత మెరుగవుతుందని నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, భద్రతా పరంగా కూడా ఇది కీలక అడుగుగా అధికారులు చెబుతున్నారు. పీఎంవో పూర్తిగా ఖాళీ అయిన అనంతరం, చారిత్రక ప్రాధాన్యం కలిగిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను ‘యుగ యుగీన్ భారత్ సంగ్రహాలయ’ పేరుతో జాతీయ మ్యూజియంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా పరిపాలనా అవసరాలు, వారసత్వ సంరక్షణ రెండింటికీ సమతుల్యత సాధించాలన్నది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు లక్ష్యంగా కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -