end
=
Wednesday, June 25, 2025
రాజకీయంకాళేశ్వరంతో వాళ్లు కోటీశ్వరులు
- Advertisment -

కాళేశ్వరంతో వాళ్లు కోటీశ్వరులు

- Advertisment -
- Advertisment -

‘రైతునేస్తం’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

‘అసెంబ్లీ ఎన్నికల ముందు (Before Assembly Elections) మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. రైతులకు సంబంధించిన రుణమాఫీ (Cleared Farmer Runa Mafi) చేశాం. అర్హులైన రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము జమ చేశాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామన్నారు.

హైదరాబాద్‌లోని సచివాలయం (Hyderabad Secretariat) ఎదురుగా మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమం (Raitu Nestham Programme)లో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసేందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు పంటలకు ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. రైతుల ఆశీర్వాదం వల్లనే తాను చిన్నవయస్సులో సీఎం అయ్యానని, రైతాంగం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశామన్నారు. మహిళలు, యువత తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పామని, అలాగే ఆ మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తమ నెత్తిన రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు మోపిందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే..

అది కాస్తా కూలిందన్నారు. ప్రాజెక్ట్ కమీషన్లతో నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కోటీశ్వరులైతే, రాష్ట్రం రాష్ట్రం మాత్రం దివాళా తీసిందన్నారు. గత ప్రభుత్వం వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూసేయిస్తే, తమ ప్రభుత్వం సర్కార్ బడులకు ప్రాణం పోస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకువచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. వెయ్యి బస్సులు కొని ఆర్టీసీకి మహిళలు అద్దెకు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -