end
=
Friday, June 20, 2025
వార్తలుజాతీయంపోరాటమెందుకు? మాట్లాడుకుందాం..
- Advertisment -

పోరాటమెందుకు? మాట్లాడుకుందాం..

- Advertisment -
- Advertisment -

బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ ప్రభుత్వాలు(Andhra pradesh, Telaganga governments) ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని, అందుకు ఎవరి మీద ఎవరిపైనా పోరాటం అవసరం లేదని ఏపీ చంద్రబాబు నాయుడు (AP cm Chandra babu naidu) అభిప్రాయపడ్డారు. బనకచర్ల (Banaka charla Project) ప్రాజెక్ట్​ నిర్మాణం అక్రమమని, ఆ పనులను నిలిపివేయాలని

గురువారం తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి (TG cm Revanth Reddy) బృందం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్​ పాటిల్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పుకొచ్చారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయని అన్నారు.

కొత్త ఆథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం సమంజసం కాదని, సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. గోదావరి నీళ్లను రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ ఏపీకి రాని ప్రాజెక్టులేనని వెల్లడించారు.

తెలంగాణకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు.ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలనే కానీ, విభేదాలు పెంచుకోవద్దని హితవు పలికారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -