end
Saturday, March 28, 2026
వార్తలురాష్ట్రీయంఇష్టంలేని పెళ్లి... వధువు ఆత్మహత్య
- Advertisment -

ఇష్టంలేని పెళ్లి… వధువు ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -

పెళ్లయిన కొన్ని గంటలకే నవవధువు విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ పెద్ద కుమార్తె లక్ష్మీ (19)కు ఆంధ్రప్రదేశ్‌ అనంతరపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మీ తన తల్లికి చెప్పింది. అనంతరంపురం చాలా దూరమని, అంతదూరం తాను వెళ్లనని కుటుంబ సభ్యులకు విన్నవించింది. కానీ పెద్దలు ఆమె మనసును అర్థం చేసుకోకుండా శుక్రవారం ఉదయం 9 గంటలకు వివాహం జరిపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ సాయంత్రం అప్పగింతల సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లక్ష్మీ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -