పైలట్ సహా ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్లో(Uttarakhand State) గౌరికుండ్ అటవీ ప్రాంతం(Gowrikund Forest Area)లో ఆదివారం తెల్లవారుజామున ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ క్రాష్(Helicopter crash) అయింది. ప్రమాదంలో పైలట్తో సహా అందులో ఏడుగురు మరణించారు. హెలికాప్టర్ కేదార్నాథ్ థామ్(Kedarnath Dham) నుంచి గుప్త్కాషికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. మృతులను పైలట్ రాజ్వీర్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్కుమార్, శ్రద్ధ, రాశిగా గుర్తించారు.
కేదార్నాథ్ నుంచి ప్రయాణికులతో ఉదయం 5.17 గంటలకు గుప్త్కాషికి బయలుదేరింది. లోయ ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల హెల్కాఫ్టర్ దారి తప్పినట్లు సమాచారం. కమాండెంట్ అర్పన్ యాదువంశీ నేతృత్వంలోని పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్నో సవాళ్ల ఎదుర్కొంటూ లోయలో క్రాష్ అయిన హెలికాఫ్టర్ వద్దకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఆరు వారాల్లో ఇది ఐదవ హెలికాప్టర్ ప్రమాదం కావడం గమనార్హం.
తాజాగా ప్రమాదంతో అధికారులు చార్ ధామ్ ప్రాంతంలో హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. “ప్రాణాలు కోల్పోయిన వారి కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సరైన సూచనలు, సలహాలు ఇస్తాం’ అని పేర్కొన్నారు.