end
=
Friday, February 27, 2026
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంకాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ: రూ.60 లక్షల నగలు గల్లంతు
- Advertisment -

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ: రూ.60 లక్షల నగలు గల్లంతు

- Advertisment -
- Advertisment -

Srikakulam : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం(Lord Venkateswara Swamy Temple) లో గత రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భక్తుల దర్శనాలకు మూసివుండిన ఈ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు వెనుక ద్వారం గుండా లోపలికి చొరబడ్డారు. భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటాన్ని గమనించిన వారు గర్భగుడి వరకు చేరుకుని స్వామివారికి అలంకరణ కోసం వినియోగించే విలువైన బంగారు, వెండి నగలను అపహరించారు. ఆలయ ధర్మకర్త ముకుంద పండా తెలిపిన వివరాల ప్రకారం చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయం మూసివుండటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగలు కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ముకుంద పండా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలానికి కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ చేరుకుని ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దొంగల కదలికలపై సమాచారం సేకరిస్తున్నారు. దొంగలు ముందుగానే ప్రణాళికతో వచ్చారని పోలీసులు భావిస్తున్నారు. ఆలయం మూసివుండటం రాత్రి వేళ భద్రతా సిబ్బంది లేకపోవడం వారికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు భరోసా వ్యక్తం చేశారు.

ఈ ఆలయం గతేడాది నవంబర్ 1న ఏకాదశి సందర్భంగా తీవ్ర విషాదానికి వేదికైంది. స్వామివారి దర్శనానికి అనూహ్యంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తరువాత పోలీసుల ఆదేశాల మేరకు భద్రతా కారణాలతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్పటి నుంచి దర్శనాలు నిలిచిపోయాయి. ఆలయం మూసివుండటంతో భక్తుల రాకపోకలు లేకపోయినా విలువైన ఆభరణాలు అక్కడే ఉండటమే తాజా చోరీకి కారణంగా మారినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -