end
=
Thursday, February 19, 2026
ఉద్యోగ సమాచారంరాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన TET-2026 పరీక్షలు
- Advertisment -

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన TET-2026 పరీక్షలు

- Advertisment -
- Advertisment -

TET : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(Teacher Eligibility Tests) (TET-2026) ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన ఈ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయానికి గంటన్నర ముందే చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయం తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తామని, ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని తెలిపారు. కాబట్టి అభ్యర్థులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలు) తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ డివైసులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని పేరు, ఫొటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. హాల్ టికెట్‌పై ఫొటో లేదా సంతకం స్పష్టంగా లేకపోతే, తాజా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో ధృవీకరణ సంతకం చేయించుకుని రావాలని తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే పరీక్షకు అనుమతి లభించకపోవచ్చని అధికారులు హెచ్చరించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను మధ్యలో బయటకు అనుమతించబోమని, పరీక్షా సమయం పూర్తయ్యాకే అందరినీ బయటికి పంపుతామని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈసారి టెట్ పరీక్షలకు పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 71,670 మంది ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కావడం విశేషం. దేశవ్యాప్తంగా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయాల్సి రావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. టెట్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -