అహ్మద్బాద్లో మెడికల్ హాస్టల్పై కూలిన విమానం
మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
ప్రమాదం నుంచి బయటపడిన ఒకేఒక ప్రయాణికుడు
అది.. అహ్మదాబాద్(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం.(Sardar Vallahbai International Airport) ఇద్దరు పైలట్లు, 10 సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులతో ఎయిర్ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం లండన్కు బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే మేఘానినగర్లోని ఓ మెడికల్ కాలేజీపై కుప్పకూలింది(Flight Crashed). సుదూర ప్రాంతానికి వెళ్లే విమానం కావడంతో లక్షల లీటర్ల ఇంధనం(Millions liters of Oil) ఉంది. విమానం ఢీకొన్న సమయంలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.
ఆ ప్రాంతంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు ఏమైందో తేరుకునేలోపే వందలాది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో హృదయ విదారక సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. విమానం కూలడానికి కొద్దిసేపటి క్రితం మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ డైనింగ్ హాలులో భోజనం చేస్తున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఒకసారిగా పేలుడు సంభవించింది.
ఏం జరిగిందో ఏమో తెలియక ముందే.. పదుల సంఖ్యలో మెడికోలు ఆగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ఘటన తర్వాత పెద్ద ఎత్తున స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక, పోలీసులతో కలిసి సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. ప్రమాదంలో మెడికల్ కాలేజీ భవనం పూర్తిగా దగ్ధమమైంది. ఎక్కడపడితే అక్కడ భవనంలో విమాన శకలాలు పడిఉండడం కనిపించింది. ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కొందరి ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి. కొందరి మృతదేహాలు మాంసం ముద్దలుగానే మిగిలాయి. మొత్తానికి ఈ ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
డీజీసీఏ ప్రకటన ప్రకారం..
ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా స్పందించింది. విమాన కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు తెలిపింది. సుమిత్కు ఎల్టీసీగా 8,200 గంటలు, కో 1,100 గంటల పాటు ఫ్లుటై నడిపిన అనుభవం ఉన్నట్లు వెల్లడించింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాలిలోకి ఎగిరినట్లు తెలిపింది.
కొద్ది సేపటికే ఫ్లుటై నుంచి ఏటీసీకి అత్యవసర కాల్ వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు ఫ్లుటై కూలిపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా ప్రమాదాన్ని ధ్రువీకరించింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒక కెనడా వాసి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికుల కోసం సమాచారం యంత్రాంగం 1800 5691 444 అనే హాట్లైన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్రప్రతి, ప్రధాని దిగ్భ్రాంతి..
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఘటనా స్థలానికి బయల్దేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాడ్లాడారు. ఎయిరిండియా-171 విమాన ఘటనపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గతంలో విమాన ప్రమాదాలు..
భారత దేశంలో చివరి ఫ్లుటై ప్రమాదం 2020లో జరిగింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు దుబాయ్ నుంచి కోజికోడ్ బయల్దేరిన ఫ్లుటై లోయలో పడింది. ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010 మే నెలలో కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లుటై ఐఎక్స్ రన్వే నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 158 మంది ప్రయాణికులు మృతిచెందారు.
1996లో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ఫ్లుటై 763, కజికిస్థాన్ ఎయిర్లైన్స్ ఫ్లుటై 1907 గగనతలంలోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో 340 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు.