- మున్సిపాలిటీల్లో మారిన పలుకరింపులు
- తెల్లవారకముందే ఓటరు ఇంటి ముందు అభ్యర్థులు
- ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు
(Hyderabad) హైదరాబాద్: ‘అన్నా..నమస్తే..అవ్వా.. బాగున్నావా? అక్కా ..మీ తమ్మున్ని మరువొద్దు..ఆపద సంపదకు వచ్చేటోన్ని..మన గుర్తు తెలుసుకు కదా’ ప్రస్తుతం రాష్టంలోని (municipals & carporations) మున్సిపాలిటీ,కార్పొరేషన్ల వార్డులో వినిపిస్తున్న మాటలివి. నిన్నా మొన్నటి వరకు స్థానికంగా సమస్యలను చెప్పుకోవడానికి ఒక్క నాయకుడు కూడా పత్తాలేరు. కానీ నేడు తన అనుచర గణాన్ని వెంటేసుకొని తెల్లవారుకముందే ఓటర్ల ఇంటితలుపును తడుతున్నారు. ఓటర్(voter) ఇంటిముందుకు వచ్చి నన్ను గెలిపిస్తే అది చేస్తాం..ఇది చేస్తామని బీరాలు పలుకుతున్నారు. ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కానీ గతంలో వీరి పనితీరు చూసిన స్థానిక ఓటర్లు వారి ముఖం మీదే వారి తీరు ప్రశ్నిస్తున్నారు. అయినా అభ్యర్థులు వారి బుజ్జగిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
వార్డులో మైకుల మోత
పురవీధుల్లో నిన్న మొన్నటి వరకు ఉన్న నిషబ్దంగా ఉండేదీ. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు (campaign vehicles)ప్రచార రథాలను పెట్టి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో తెల్లవారకముందే మైకుల మోతలు వినబడుతున్నాయి.
