end
=
Tuesday, February 17, 2026
రాజకీయంపుర వీధులో..ఇక సమరమే
- Advertisment -

పుర వీధులో..ఇక సమరమే

- Advertisment -
- Advertisment -
  • నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం
  • ప్రచారంలో  పాల్గొననున్న పార్టీల నేతలు
  • ఇప్పటికే పురవీధుల్లో ఇన్‌చార్జిలు మకాం

(Hyderabad) హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పురవీధుల్లో నేటి  నుంచి ఇక సమరమే సాగనున్నది. మున్సిపల్‌ ఎన్నికల్లో నిన్నమొన్నటివరకు నామినేషన్లు ,ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. దీంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌(congress),బీఆర్‌ఎస్‌ (BRS),బీజేపీ(BJP)తో పాటు చిన్నాచితక పార్టీలు,  రెబల్స్‌ అభ్యర్థుల  ప్రచారం హోరెత్తనున్నది.ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరుఫున ఆయా వార్డులో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను ఆయా పార్టీలు ఇన్‌చార్జీలుగా నియమించింది. దీంతో వారు ఆయా వార్డులో మఖాం వేసి ప్రచార వ్యుహాలను రచిస్తున్నారు.

ప్రచార పర్వంలోకి  పార్టీల పెద్దలు

మున్సిపల్‌(municipal elections) ఎన్నికల్లో నేటి నుంచి  ప్రధాన పార్టీల అభ్యర్థుల తరుఫున ప్రచారం(campain) చేసేందుకు పార్టీల పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వారి ప్రచార షెడ్యూల్‌ను సైతం ఖరారు చేసుకున్నారు. ఇవాల సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారిగా మిర్యాలగూడలో పర్యటించనున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకమైన నితిన్‌ నబీ సిన్హా మహబూబ్‌నగర్‌కు రానున్నారు.దీంతో మున్సిపల్‌ ప్రచారం ఇక వేడెక్కనున్నది.

పార్టీలకు రెబల్స్‌ బెడద

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ ,బీజేపీలకు రెబల్స్‌(Rebals) బెదడ పట్టకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని  మున్సిపాల్టీల్లోని ఆయా వార్డులో రెబల్స్‌ బరిలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై  ఈ  ప్రభావం చూపనున్నది. దీంతో ప్రచారం కోసం ఎక్కువగా ఖర్చు కానున్నది.

సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం

ప్రచారం సమయం తక్కువగా ఉండడంతో  ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ ,బీజేపీలు ప్రచారం కోసం తమ పార్టీల  సోషల్‌మీడియా ఖాతాల్లో ప్రచారాన్ని హోరెతించునున్నారు. దీని కోసం ఆయాపార్టీలు  ప్రత్యేకంగా సోషల్‌ మీడియా పట్ల అవగాహన  ఉన్న యువతను ఎంపిక  చేసుకొని క్షణక్షణం అభ్యర్థులకు మద్దతుగా పోస్టులు పెట్టిస్తున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -