end
=
Monday, June 16, 2025
సినీమాదర్శకుడు ఏఎస్​ రవికుమార్​ చౌదరి కన్నుమూత
- Advertisment -

దర్శకుడు ఏఎస్​ రవికుమార్​ చౌదరి కన్నుమూత

- Advertisment -
- Advertisment -

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film industry)లో విషాదం నెలకొన్నది. ప్రముఖ దర్శకుడు ఏఎస్​ రవికుమార్​ చౌదరి (Director Ravikumar Chowdary)బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విభిన్న కథల నేపథ్యం తీసుకుని విలక్షణమైన సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత. ‘యజ్ఞం’ సినిమా ఆయన తీసిన చిత్రాల్లో మేటి(Yagnam Movie Blockblaster). ‘ఈతరం ఫిలింస్​’ పోకూరి బాబూరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నది.

రాయలసీమలో కక్షలు కార్పణ్యాలు వద్దు.. అక్కడ శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలనే కథాంశంతో సినిమా తీశారు. నందమూరి బాలకృష్ణతో తీసిన చిత్రం ‘వీరభద్ర’ చిత్రం బాక్స్​ ఆఫీస్​ వద్ద బోల్తాకొట్టింది. తర్వాత వచ్చిన ‘ఏం పిల్లడో .. ఏం పిల్లో’ చిత్రం కూడా నిరాశే మిగిల్చింది. ‘పిల్లా నువ్వులేని జీవితం’ తన కెరీర్​లో బ్లాక్​ బ్లాస్టర్​’. తర్వాత గోపిచంద్​తో తీసిన ‘సౌఖ్యం’, తాజాగా యువ కథనాయకుడు రాజుతరుణ్ తీసిన ‘తిరగ బడరా సామి’ చిత్రాలపై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.​

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రవికూమార్​ చౌదరి గుంటూరులోని జాగర్లమూడి విద్యాసంస్థలో విద్యాభ్యాసం చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండేది. ఎన్నో ఆశలతో టాలీవుడ్​లో అడుగుపెట్టిన రవికుమార్​ చౌదరి ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయినప్పటికీ.. అవకాశాలు కల్పించుకుని దర్శకుడిగా ఎదిగారు.

ఎదిగే క్రమంలోనే జీవిత భాగస్వామితో మనస్పర్థలు, కుటుంబ కలహాలు.. ఏమైతేనేం.. ఆయన భార్యతో విడిగా ఉంటున్నారు. దంపతులకు ఓ కుమార్తె. ఇంకా అంతా సర్దుకుంటుంది.. మళ్లీ రవికుమార్​ చౌదరి ఇండస్ట్రీకి బ్లాక్​ బస్టర్​ ఇస్తారు..అనుకునేలోపు ఆయన్ను మృత్యువు కబళించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -