ఫోన్ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్రావు(Ex SIB chief Prabhakar rao)మంగళవారం నాలుగోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)(Special investigation team) విచారణకు విచారణకు హాజరయ్యారు. ఈసారి సిట్ 600 మంది ఫోన్ట్యాపింగ్(Phone taping) ఆడియో క్లిప్పింగ్స్(Audio clippings) వినిపించి, మరీ ప్రభాకర్రావును ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఆడియో క్లిప్పింగ్స్ ఆధారంలో లోతైన విచారణ చేయనున్నట్లు తెలుస్తున్నది. వీరిలో ప్రభుత్వ పెద్దలు, న్యాయమూర్తుల క్లిప్పింగ్స్ కూడా ఉంటాయని సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి నేతృత్వంలో ఫోన్ట్యాపింగ్ జరిగిందనే విషయంపై సిట్ స్పష్టమైన వాంగ్మూలం తీసుకుంటుందని.. దాన్ని బట్టి ప్రభాకర్రావును మరికొన్నిసార్లు విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
సాక్షిగా పీసీసీ చీఫ్ వాంగ్మూలం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ మంగళవారం సాక్షిగా విచారణకు హాజరయ్యారు. 2023లో తాను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నానని, నాడు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుమేరకు నాడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగానే పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.