end
=
Thursday, June 19, 2025
రాజకీయంకేసీఆర్​ టాప్​గేర్​.. ఇక ‘కారు’ దూకుడు
- Advertisment -

కేసీఆర్​ టాప్​గేర్​.. ఇక ‘కారు’ దూకుడు

- Advertisment -
- Advertisment -

సర్కార్‌పై పోరుకు సిద్ధం

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నగారా మోగనున్నాయనే (Notification Soon) సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్(Brs Chief KCR)​ ఫాం హౌస్​ను వీడి జనం మధ్యకు రానున్నారు. రైతులకు ‘రైతుభరోసా’(Raitu Bharosa Scheme) ఇచ్చి రాబట్టుకోవాలనే ఎత్తుగడతో కాంగ్రెస్​ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్నది.

ఆ ఎత్తుగడను చిత్తు చేసే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్​ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకు అస్త్రంగా కాళేశ్వరం ప్రాజెక్ట్​పై ఉద్దేశ పూర్వకమైన నిర్లక్ష్యం, 90శాతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాగా, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా ఉంటున్న వైఖరిని ఎంచుకున్నారని సమాచారం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

దీనిలో భాగంగానే కేసీఆర్​ త్వరలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారని, కాంగ్రెస్​ ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించేలా దిశానిర్దేశం చేస్తారని బోగట్టా. మేడిగడ్డ పరిధిలో రెండు పిల్లర్లు కుంగాయన్న సాకుతో ఆయకట్టును ఎండబెడుతున్నారని, రాష్ట్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని గులాబీ శ్రేణులు ప్రచారం చేసేలా ఉద్బోధ చేస్తారని విశ్వసనీయ సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -