‘ఐ లవ్ పాకిస్థాన్. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు నేనే వాటిని ఆపా. భారత ప్రధాని మోదీ (Indian Prime Minister Modi) చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయనతో ఇటీవల ఫోన్లో మాట్లాడా. అమెరికా త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం (Economical Resolution) ఉంటుంది’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (PAK army chief Munir)తో బుధవారం ట్రంప్ వైట్ హౌస్(White house)లో లంచ్ చేశారు. అనంతరం వైట్హౌస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఒక మీడియా ప్రతినిధి ‘మీరు మునీర్తో భేటీ అయ్యారా?’ అని ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. ‘యుద్ధం ఆపడంలో పాకిస్థాన్ వైపు నుంచి మునీర్ ఎంతో కీలకవ్యక్తి. భారత్ తరఫు నుంచి మోదీ కీలకం. వారి వల్లే యుద్ధం ఆపగలిగా. భారత్, పాక్ రెండు అణ్వాయుధ దేశాలే. ఆ రెండు దేశాలు యుద్ధంలో పాల్గొనకుండా నేను ఆపాను.’
అని ట్రంప్ పేర్కొన్నారు. ‘భారత్ కాల్పుల విరమణలో మీ పాత్రేం లేదు..’ అని భారత ప్రధాని మోదీ చెప్పినా.. యుద్ధం తానే ఆపా.. అని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించడం గమనార్హం.