end
=
Tuesday, June 24, 2025
వార్తలురాష్ట్రీయంటీజీ గ్రామీణ బ్యాంకు రుణమాఫీ ఏమైంది?
- Advertisment -

టీజీ గ్రామీణ బ్యాంకు రుణమాఫీ ఏమైంది?

- Advertisment -
- Advertisment -

1,5000 మంది రైతులు ఎదురుచూస్తున్నారు..
కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) రైతులకు సంబంధించిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ (Runa mafi Scheme) చెప్తున్నదని, కానీ.. ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ (Telangagana Grameena Bank) పరిధిలోనే 15,000 మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ కాలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Central Minister Kisan Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే లక్షలాది మంది రైతులకు సంబంధించిన రూ.లక్షలోపు రుణాలు అమలు కాలేదని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి హ్యుమన్​ రిసోర్స్​ మేనేజ్​మెంట్​ డెవలప్​మెంట్​ ఇనిస్టిట్యూట్​ (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో

సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రుణమాఫీ కానీ రైతుల సమాచారం సేకరించాలని సూచించారు. బ్యాంకుల నుంచి సమగ్రమైన సమాచారం తీసుకుని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఎల్లప్పుడూ రైతులకు దన్నుగా నిలిచిందని కొనియాడారు.

2014లో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల సంఖ్య 6,000 ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 6,600కు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, క్రాఫ్ట్ లోన్లు, టర్మ్ లోన్లు, వ్యవసాయ రుణాలు, డెయిరీ, పాల్ట్రీ రంగాలపై బ్యాంకర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాంకు యేటా కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ లబ్ధిదారుకు, ఒక మహిళకు రుణం అందించాలని ఆదేశించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -