వాతావరణశాఖ (Meteorological Department) భారీ వర్ష సూచన(Heavy Rainfall) మేరకు బుధ, గురువారాల్లో హనుమకొండ, జనగామ, మహబాబూబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని మంగళవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని పాఠశాలల్లో యజమాన్యాలు ఈ రెండు రోజులు ఒక్కపూట తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం మాత్రమే తరగతులు నిర్వహించాలని, ఉత్తర్వులను అత్రిక్రమించిన యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.