Varanasi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి నేడు నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల(Bharat Express trains)ను జాతికి అంకితం చేశారు. బనారస్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘనమైన కార్యక్రమంలో బనారస్–ఖజురాహో, లక్నో–సహరాన్పూర్, ఫిరోజ్పూర్–ఢిల్లీ మరియు ఎర్నాకుళం–బెంగళూరు మార్గాలపై ఈ సెమీ-హైస్పీడ్ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు ప్రారంభంతో, దేశంలోని పలు రాష్ట్రాలు మరింత వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని పొందనున్నాయి. వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే ఆధునీకరణలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “వందే భారత్ రైళ్లు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, దేశ అభివృద్ధి దిశగా ముందడుగు” అని పేర్కొన్నారు. ఆయన తెలిపారు వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక రైళ్లు భారతీయ రైల్వేలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక ప్రగతిలో మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని, భారత్ కూడా అదే దిశగా వేగంగా సాగుతోందని. రైల్వే నెట్వర్క్ విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా దేశ రవాణా రంగం రూపురేఖలు మారుతున్నాయని ఆయన వివరించారు. వందే భారత్ రైళ్లు ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో రూపొందించబడ్డాయని, భారత ఇంజనీర్ల ప్రతిభకు ఇది ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కొత్త రూట్ల వివరాలు:
బనారస్-ఖజురహో: ఈ రైలు వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్ వంటి పుణ్యక్షేత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఖజురహోతో కలుపుతుంది. దీనివల్ల ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో పడుతున్న సమయం కన్నా 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో-సహరాన్పూర్: ఈ మార్గంలో ప్రయాణ సమయం సుమారు గంట వరకు తగ్గనుంది. లక్నో, బరేలీ, మొరాదాబాద్, సహరాన్పూర్ ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పవిత్ర నగరమైన హరిద్వార్కు వెళ్లేవారికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుందని అధికారులు వివరించారు.
ఫిరోజ్పూర్-ఢిల్లీ: పంజాబ్లోని ఫిరోజ్పూర్, పాటియాలా వంటి కీలక నగరాలను దేశ రాజధాని ఢిల్లీతో వేగంగా అనుసంధానించే ఈ రైలు, ప్రయాణ సమయాన్ని 6 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలను పెంచడానికి ఈ సర్వీస్ దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది.
ఎర్నాకుళం-బెంగళూరు: దేశంలోని రెండు ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలైన ఈ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ వందే భారత్ రైలు 2 గంటలకు పైగా తగ్గిస్తుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
