end
=
Wednesday, March 4, 2026
వార్తలుఅంతర్జాతీయంజీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన డొనాల్డ్ ట్రంప్‌..
- Advertisment -

జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించిన డొనాల్డ్ ట్రంప్‌..

- Advertisment -
- Advertisment -

Donald Trump : ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా (South Africa)లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి (G20 summit) అమెరికా ప్రతినిధులు హాజరుకాబోరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. శ్వేతజాతి రైతులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్షత, హింసాత్మక చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికలో అధికారికంగా వెల్లడించారు. నవంబర్‌ 22-23 తేదీల్లో జరగబోయే ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచంలోని ప్రముఖ మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నేతలు పాల్గొననున్నారు. అయితే ట్రంప్‌ తన తరఫున ఎవ్వరినీ పంపబోమని స్పష్టంచేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన స్థానంలో హాజరవుతారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, వాన్స్‌ కూడా ఈ సమావేశానికి వెళ్లరని ట్రంప్‌ స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాలో జీ20 సమావేశం నిర్వహించడం ఒక అవమానం. అక్కడి ప్రభుత్వం శ్వేతజాతి ఆఫ్రికానెర్ రైతులపై జరుపుతున్న దారుణాలు అంగీకారయోగ్యం కావు అని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఆయన మాటల్లో, దక్షిణాఫ్రికా ప్రభుత్వం మైనారిటీ ఆఫ్రికానెర్ రైతుల భూములు, పొలాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ, హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్రంప్‌ పరిపాలన ఈ విషయంపై కఠినమైన వైఖరి తీసుకుంది. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై జరుగుతున్న దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనలుగా పరిగణించాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఆయన ఇటీవల మయామిలో జరిగిన సభలో మాట్లాడుతూ..దక్షిణాఫ్రికా వంటి దేశాలకు జీ20 వేదికలో స్థానం ఉండకూడదు అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్పందిస్తూ..ఆఫ్రికానెర్ కమ్యూనిటీపై హింస జరుగుతుందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ఈ విషయం గురించి ట్రంప్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చాను అని తెలిపారు. ఆయన మాటల్లో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పటికీ నల్లజాతి పౌరుల కంటే మెరుగ్గానే ఉన్నాయి అని పేర్కొన్నారు. ఇక, ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికా-దక్షిణాఫ్రికా సంబంధాలపై కొత్త ఉద్రిక్తతలను తెచ్చే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. జీ20 వేదికపై అమెరికా గైర్హాజరు ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక చర్చలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికా జీ20 శిఖరాగ్ర సమావేశం కొత్త రాజకీయ వివాదాలకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -