end
=
Thursday, February 12, 2026
వార్తలుఅంతర్జాతీయం16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం.. ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని
- Advertisment -

16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం.. ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని

- Advertisment -
- Advertisment -

Canberra : ఆస్ట్రేలియా ప్రభుత్వం సామాజిక మాధ్యమాల వాడకంపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధిస్తూ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ (Anthony Albanese) ఒక కీలక ప్రకటన చేశారు. ఈ నూతన చట్టం ఆన్‌లైన్‌ సేఫ్టీ ఎమెడ్మెంట్‌ బిల్‌-2024(Online Safety Amendment Bill-2024) పేరుతో రూపొందించబడింది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌ 10 (ఈరోజు)నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌, యూట్యూబ్‌ వంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా వేదికలు 16 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖాతాలను పూర్తిగా నిరోధించాలి. పిల్లల ఆన్‌లైన్‌ భద్రత, మానసిక ఆరోగ్య పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది.

ప్రధాని అల్బనీస్‌ మాట్లాడుతూ..సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు యువతపై చూపిస్తున్న ప్రతికూల ప్రభావం పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, బుల్లీయింగ్‌, మరియు ఆన్‌లైన్‌ దాడులు పిల్లల మనసుపై దుష్ప్రభావం చూపుతున్నాయి. కనుక పిల్లలను ఈ హానికర వేదికల నుండి రక్షించడం మా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ (Australian House of Representatives)లో భారీ మెజారిటీతో ఆమోదం లభించింది. మొత్తం 102 ఓట్లతో అనుకూలంగా బిల్లును ఆమోదించారు. అనంతరం సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో కూడా 34 మంది అనుకూలంగా, 19 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీని ద్వారా బిల్లుకు పూర్తి ఆమోదం లభించింది. ఇక, చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే వారికి భారీ జరిమానా విధించనున్నారు. పిల్లల ఖాతాలను నిరోధించడంలో విఫలమయ్యే సంస్థలకు గరిష్టంగా 50 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.273 కోట్లు) వరకు జరిమానా విధించవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది.

ఆస్ట్రేలియా ఇప్పటికే ఆన్‌లైన్‌ భద్రతకు సంబంధించిన కఠినమైన చట్టాలను అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. ఈ కొత్త బిల్లు చట్టరూపం దాల్చితే, 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన ప్రపంచంలోని తొలి దేశంగా ఆస్ట్రేలియా చరిత్రలో నిలిచిపోనుంది. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మరియు మానసిక నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పిల్లల మానసిక స్థితి మెరుగుపడటానికి, ఆన్‌లైన్‌ బుల్లీయింగ్‌ తగ్గటానికి ఇది పెద్దదైన ముందడుగు అని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, కొన్ని మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ నిషేధం వ్యక్తిగత స్వేచ్ఛను కట్టడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా, డిసెంబర్‌ 10 (ఈరోజు)నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టం ఆన్‌లైన్‌ ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -