end
Thursday, April 16, 2026
క్రీడలుజైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం
- Advertisment -

జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం

- Advertisment -
- Advertisment -

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్‌(Indian Women’s Cricket)కు ప్రతీకగా నిలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Captain Harmanpreet Kaur) మరో చారిత్రాత్మక గుర్తింపును అందుకోబోతున్నారు. రాజస్థాన్‌(Rajasthan)లోని ప్రసిద్ధ జైపూర్ వాక్స్ మ్యూజియం(Jaipur Wax Museum)లో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ మైనపు విగ్రహం(Wax statue) ఏర్పాటు చేయాలని మ్యూజియం నిర్వాహకులు నిర్ణయించారు. దీనితో, ఇలాంటి గౌరవం దక్కించుకున్న ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ పేరు చరిత్ర పుటల్లో నిలవనుంది. ఇప్పటికే విగ్రహం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మ్యూజియం వ్యవస్థాపకులు, క్యూరేటర్ అనూప్ శ్రీవాస్తవ వివరాలు వెల్లడించారు. ఇటీవల మ్యూజియం బృందం ముంబైలో హర్మన్‌ప్రీత్‌ను కలిసి, విగ్రహం రూపకల్పనకు అవసరమైన శరీర కొలతలు, స్టిల్ ఫొటోలు, వీడియోలు సేకరించిందని ఆయన తెలిపారు.

సుమారు గంటన్నర పాటు సాగిన ఆ సమావేశంలో హర్మన్‌ప్రీత్ సమగ్రంగా సహకరించారని శ్రీవాస్తవ చెప్పారు. మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాటు విషయంపై హర్మన్‌ప్రీత్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారని ఆయన వివరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరుకాబోతున్నట్టు ఆమె తెలిపిందని అన్నారు. మ్యూజియం బృందం చేసిన ఆత్మీయ ఆహ్వానం, గౌరవానికి హర్మన్‌ప్రీత్ ధన్యవాదాలు తెలిపినట్లు శ్రీవాస్తవ వెల్లడించారు. అదేవిధంగా, మ్యూజియంలోని ‘శీశ్ మహల్’ విభాగం ఆమెను చాలా ఆకట్టుకుందని, మైనపు విగ్రహాలను తయారు చేసే విధానంపై ఆసక్తిగా ప్రశ్నలు అడిగిందని చెప్పారు. యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల ప్రతిమలను మ్యూజియంలో ప్రతిష్ఠించడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీవాస్తవ తెలిపారు. హర్మన్‌ప్రీత్ క్రీడా ప్రస్థానం, నాయకత్వం, ఆమె వ్యక్తిత్వం ఇవి అన్నీ యువ మహిళలకు గొప్ప ప్రేరణ. అందుకే ఆమె విగ్రహం మా మ్యూజియం ప్రతిష్ఠను మరింత పెంచుతుంది అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే మ్యూజియంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సైనా నెహ్వాల్, సందీప్ సింగ్ వంటి భారత క్రీడా ఐకాన్ల మైనపు ప్రతిరూపాలు ఏర్పాటు చేయబడినట్లు ఆయన గుర్తుచేశారు. 300 ఏళ్ల చరిత్ర గల నహర్‌గఢ్ కోటలో ఏర్పాటు చేసిన జైపూర్ వాక్స్ మ్యూజియం రాజస్థాన్ పర్యటనలో ప్రముఖ ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కోటను సందర్శించే దేశ‒విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా ఉండటంతో, హర్మన్‌ప్రీత్ విగ్రహం మ్యూజియానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత మహిళా క్రికెట్ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన హర్మన్‌ప్రీత్‌కు దక్కుతున్న ఈ గౌరవం క్రీడాభిమానులలో ఆనందాన్ని కలిగిస్తోంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -