end
=
Monday, December 22, 2025
వార్తలుఅంతర్జాతీయంఅందుకే దేశం విడిచి భారత్‌కు వచ్చా.. భయపడి కాదు: షేక్‌ హసీనా
- Advertisment -

అందుకే దేశం విడిచి భారత్‌కు వచ్చా.. భయపడి కాదు: షేక్‌ హసీనా

- Advertisment -
- Advertisment -

Bangladesh : బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలపై (Bangladesh protests)ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది దేశంలో చెలరేగిన హింస, మారణహోమాన్ని అరికట్టేందుకే తాను దేశం విడిచి భారత్‌కు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. భయంతో పారిపోలేదని, దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలన్న బాధ్యతతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే తాను దేశం విడిచిన తరువాత కూడా పరిస్థితులు మరింత క్షీణించాయని, ఉద్రిక్తతలు తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తరువాత పాలన బలహీనమైందని, చట్టపాలన పూర్తిగా కూలిపోయిందని విమర్శించారు. పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని హెచ్చరించారు.

ఈ పరిణామాలు భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహబంధాలకూ ప్రతికూలంగా మారుతున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన అల్లర్లలో 25 ఏళ్ల మైనారిటీ యువకుడు దీపూ చంద్రదాస్‌ను దారుణంగా హత్య చేసి, అతడి మృతదేహాన్ని నిప్పంటించిన ఘటనపై షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల భద్రతను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక చర్యలు తీసుకుంటోందని, బయటకు మాత్రం స్నేహం కోరుతున్నట్లు నటిస్తోందని మండిపడ్డారు. ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్–బంగ్లా మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని బలహీనపరచలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

యూనస్‌కు మద్దతుగా ఉన్న తీవ్రవాద శక్తులే దేశ ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని హసీనా ఆరోపించారు. అవే శక్తులు తన కుటుంబాన్ని, తనను ప్రాణభయంతో దేశం విడిచే పరిస్థితికి నెట్టాయని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దౌత్య కార్యాలయాలను, ప్రజా ఆస్తులను రక్షించాల్సి ఉంటుందని, కానీ యూనస్ ప్రభుత్వం గూండాలకు మద్దతిస్తూ వారిని దేశభక్తులుగా చిత్రీకరిస్తోందని విమర్శించారు. తమ పాలనలో తీవ్రవాదులుగా గుర్తించి జైలులో పెట్టిన వారిని విడుదల చేయడం వల్లే అల్లర్లు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా, యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఫైసల్ కరీం మసూద్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసి, ప్రయాణ నిషేధం విధించినట్లు వెల్లడించింది. అతడి కదలికలపై నిఘా కోసం బహుళ దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపినట్లు భద్రతా సంస్థలు తెలిపాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -