end
=
Friday, February 13, 2026
రాజకీయంనేడు ఏపీ కేబినెట్ భేటీ..అమరావతి అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలపై కీలక నిర్ణయాలు!
- Advertisment -

నేడు ఏపీ కేబినెట్ భేటీ..అమరావతి అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలపై కీలక నిర్ణయాలు!

- Advertisment -
- Advertisment -

Amaravati : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయం(Secretariat)లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు వేగంగా, సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అమరావతిని హైటెక్ రాజధానిగా తీర్చిదిద్దే చర్యలు రాజధాని అమరావతి విస్తృత అభివృద్ధి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంది. అమరావతిని సాంకేతిక, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇందుకు రూ.103.96 కోట్ల వ్యయం చేయనున్నారు.

అలాగే సచివాలయ పరిధిలోని అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక వసతులు, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు రూ.109 కోట్ల నిధుల కేటాయింపుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల భూమిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, రాజకీయ చర్చలు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా తుళ్లూరు ప్రాంతంలో ఆరు ఎకరాల భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వర్షాకాలంలో వరద ముంపు నుంచి రాజధాని ప్రాంతాన్ని రక్షించేందుకు రూ.444 కోట్లతో 8,400 క్యూసెక్కుల సామర్థ్యం గల ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించే అవకాశముంది.

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎల్పీఎస్ జోన్–8 పరిధిలో లే అవుట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,358 కోట్ల నిధుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రుషికొండ భవనాల అంశం, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -