end
=
Friday, February 13, 2026
రాజకీయంఅసెంబ్లీకి కేసీఆర్ ఎంట్రీ: వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు
- Advertisment -

అసెంబ్లీకి కేసీఆర్ ఎంట్రీ: వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు

- Advertisment -
- Advertisment -

Telangana : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (KCR) అసెంబ్లీ సమావేశాల్లో (assembly meetings) పాల్గొనడానికి పూర్తి స్థాయి వ్యూహంతో సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రమే ఆయన ఎర్రవల్లి ఫాం హౌస్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం నందినగర్ నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. చాలాకాలం తర్వాత కేసీఆర్ సభలో అడుగుపెడుతుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. గతంలో కేసీఆర్‌ను సభకు రావాలని బహిరంగంగా సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పుడు ఆయన హాజరుతో పూర్తి స్థాయి చర్చకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజావ్యతిరేక విధానాలు, రైతుల సమస్యలు, సాగునీటి రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా ప్రశ్నించాలనే దిశగా కేసీఆర్ ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ముఖ్యంగా కృష్ణా జలాల సాధన, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులపై చర్చ జరగాలని బీఆర్‌ఎస్ కోరుతోంది. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను సభ ముందుంచాలని కూడా పార్టీ భావిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం సాగునీటి అంశంపై సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వకుండా, ఒక రోజుకే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం జరిగిందన్న అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని చర్చను నడిపించాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ రచిస్తోంది. అంతేకాదు, ఈ సమావేశాలను రెండు నుంచి మూడు రోజుల్లోనే ముగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో మరో విశేషం ఏమిటంటే, జ్యుడీషియరీ క్యాడర్ అధికారి ఆర్. తిరుపతి అసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొదటి రోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసలు ఎజెండా ఖరారవుతుంది.

గత సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు ఇబ్బంది పడిన విషయాన్ని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో చర్చలు మరింత పదునెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిన 2015 ఒప్పందాన్ని ప్రధాన ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిపుణులతో చర్చలు జరిపి సభలో దూకుడుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారనున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -