end
=
Friday, February 20, 2026
వార్తలుజాతీయంఎల్‌ఓసి వద్ద పాక్ డ్రోన్ కలకలం: అప్రమత్తమైన భద్రతా దళాలు
- Advertisment -

ఎల్‌ఓసి వద్ద పాక్ డ్రోన్ కలకలం: అప్రమత్తమైన భద్రతా దళాలు

- Advertisment -
- Advertisment -

Pakistan Drone: జమ్ము కశ్మీర్‌(Jammu and Kashmir)లోని పూంఛ్ జిల్లా(Poonch district)లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనుమానాస్పద పాకిస్థాన్ డ్రోన్(Pakistan drone) కదలికలు కలకలం రేపాయి. నూతన సంవత్సర వేడుకల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా వర్గాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. భారత గగనతలంలోకి అక్రమంగా చొరబడిన డ్రోన్ ఐఈడీకి సంబంధించిన సామగ్రి, మాదక ద్రవ్యాలను జారవిడిచినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతా దళాలు వేగంగా స్పందించి, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి.

మీడియా కథనాల ప్రకారం, పూంఛ్ సెక్టార్ పరిధిలోని ఎల్‌ఓసి సమీపంలోని ఖాదీ కర్మదా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ సుమారు ఐదు నిమిషాల పాటు భారత భూభాగంపై చక్కర్లు కొట్టిందని సమాచారం. ఈ సమయంలోనే అనుమానాస్పద ప్యాకెట్‌ను జారవిడిచినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. డ్రోన్ తిరిగి సరిహద్దు వైపు మళ్లిన వెంటనే, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో జారవిడిచిన ప్యాకెట్‌లో ఐఈడీకి ఉపయోగించే మందుగుండు సామగ్రి, కొంతమేర మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. దీనితో ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నిన అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిసర గ్రామాలు, అడవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించకూడదనే ఉద్దేశంతో ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టేలా చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, నూతన సంవత్సరం సందర్భంగా పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు జమ్ము కశ్మీర్‌లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని గతంలోనే నిఘా వర్గాలు హెచ్చరించినట్లు అధికారులు గుర్తుచేశారు. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే సైన్యం, పోలీసు బలగాలు ఇప్పటికే ఎల్‌ఓసి వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశాయి. తాజా డ్రోన్ ఘటనతో ఆ అప్రమత్తత మరింత పెరిగింది. ప్రస్తుతం భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచడంతో పాటు, డ్రోన్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఎల్‌ఓసి వెంబడి శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -