ఫోన్ ట్యాపింగ్కేసులో కీలక పరిణామం
హైదరాబాద్(KCR): ట్యాపింగ్ కేసులో సిట్ తన దూకుడును పెంచింది. నిన్న మొన్నటి వరకు సిట్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు( HARISHRAO), మాజీ ఎంపీ సంతోష్రావుల(SANTHOSH RAO)కు నోటీసులు ఇచ్చిన సిట్ ఒక్క అడుగు ముందుకేసి ఏకంగా ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత,తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కు సిట్ నోటీసులు ఇవ్వనున్నది. ఇందుకోసం గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు సిట్ అధికారులు సిట్ నోటీసులతో బయలు దేరి వెళ్లారు.
