- పెండింగు బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలి
- ఈ నెల 17న తాసిల్దార్లకు వినతిపత్రాల సమర్పణ
- మే 5వ తేదీన కలెక్టర్లకు మొమోరాండం అందజేత
- తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
తెలుగు 24, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGE JAC) చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను, ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. సత్వరం పరిష్కరించాల్సిన పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో ఎకగ్రీవంగా తీర్మానించారు. ఈ వివరాలను కమిటీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ వెల్లడించారు.
1) రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ (Pending bills) క్లియర్ చేయాలి.
2) రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ (Health cards) జారీ చేసి, తక్షణమే అమలు చేయాలి.
3) సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి.
4) కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి.
5) గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల (VRA) వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలి.
6) ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
7) త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి.
8) ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.. అని ప్రభుత్వాన్ని కోరారు.
జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ
ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈ జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తున్నట్టు లచ్చిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తాసిల్దార్లకు మెమోరాండంలు ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక చేరేలా చూస్తామన్నారు. మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.
కమిటీ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షులు భిక్షం, రాష్ట్ర కోశాధికారి మల్లేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె. హన్మంత్ రావు, తెలంగాణ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్, తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ. కృపాకర్, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. రాములు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.జి. నిర్మల, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అశ్వద్దామ రెడ్డి, తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ అధ్యక్ష, కార్యదర్శి దర్శన్ గౌడ్, ఉపేందర్ రావు, తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాబర్ట్ బ్రూస్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షులు డా.కత్తి జనార్దన్, తెలంగాణ డీజేబుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు హాబీబ్ మస్తాన్, తెలంగాణ జీపీవో అసోసియేషన్ అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు, తెలంగాణ జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. వీ. సుభాష్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జీ.హెచ్.ఎమ్.సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దరి గోపాల్, తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్.రవి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్. నర్సింహులు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఫిమేల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రొక్కం దేవిక, తెలంగాణ ప్రభుత్వ ఫార్మాసి ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి. సుదర్శన్ గౌడ్, టీజీబీసీ ఉపాద్యాయ సంఘం ఎం. చంద్రశేఖర్ గౌడ్, ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకట్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సాయిరెడ్డి, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పి. లక్ష్యయ్య, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్. నర్సింహులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ టీచర్, లెక్షరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల శ్రీధర్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శిరందాస్ రాందాస్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డా.రామకృష్ణ, ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరికృష్ణ, తెలంగాణ ఎస్సి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్, మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ మొయినుద్దీన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, తెలంగాణ లాంగ్వేజ్ కల్చరర్ డిపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షులు హేమలత, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్, హెచ్.ఎమ్.డబ్ల్యూ.ఎస్. అండ్ ఎస్.బీ.ఈ.డబ్ల్యూ.ఏ. అధ్యక్షులు సుగంధిని, స్పోస్ ఫోరమ్ అధ్యక్షులు వివేక్ తో పాటు అనేక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
