end
=
Tuesday, January 27, 2026
వార్తలురాష్ట్రీయంకల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- Advertisment -

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisment -
- Advertisment -

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 248 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ2.48 కోట్లు విలువైన చెక్కులను భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరు పేదలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 3,500 చెక్కులకు గాను రూ.25 కోట్లు పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -