‘కాంత’ చిత్రానికి సంబంధించి మొదటి పాట విడుదలైంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిలమ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా ‘పసిమనసే’ అనే మెలోడి పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్కే గాత్రం అందించగా, కృష్ఱకాంత్ సాహిత్యం సమకూర్చారు. జాను చంతూర్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల కానుంది. డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.