end
=
Tuesday, June 24, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంమిద్దెపై డ్రాగన్​ ప్రూట్స్​ తోట.. నెలకు లక్ష ఆదాయం !
- Advertisment -

మిద్దెపై డ్రాగన్​ ప్రూట్స్​ తోట.. నెలకు లక్ష ఆదాయం !

- Advertisment -
- Advertisment -

నలుగురు నడిచిన దారిలో నడిచే వారు కొందరైతే.. మనమెందుకు ఆ దారిలో నడవాలి. మనకంటూ కొత్తబాటలు ఎందుకు వేసుకోలేం? అని ప్రశ్నించుకునే మరికొందరు ఉంటారు. అలాంటి వారే అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి కోవకే చెందుతారు కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన రెమాభాయ్ (58) (Lecturer Remahbai). జంతుశాస్త్ర అధ్యాపకురాలామె (Ex Zoology Teacher). 35 ఏళ్ల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పి 2022లో పదవీ విరమణ చేశారు.

విశ్రాంతి సమయాన్ని ఎందుకు వృథా చేయాలి.. కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఆలోచనతో మిద్దె తోటల పెంపకంపై దృష్టి సారించారు. మట్టి, సరైన సరైన వసతులు లేకుండానే ఆమె ఇప్పుడు డ్రాగన్​ తోట (Dragon Farming) పెంచుతున్నారు. నెలకు 500 కిలోల చొప్పున డ్రాగన్ పండ్లను పండిస్తున్నారు. తద్వారా రూ.లక్ష ఆర్జిస్తున్నారు(Monthly Income One Lakh). సాగుపై ఆమె స్పందిస్తూ.. ‘నా 15 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. మేం 13 మంది సంతానం.

అమ్మ ఒక్కతే మా అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములందరినీ చూసుకుంది. ఆమె చాలా బలమైన మహిళ. ఇటీవల ఆమె మరణించారు. నా భర్త నిత్యం ఉద్యోగ పనిలో బిజీగా ఉంటారు. కుమారుడు ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటాడు. కాస్త ఒంటరితనం అనిపించి, మిద్దె తోటల పెంపకంపై దృష్టి సారించాను. మార్కట్​లో డ్రాగన్​ ఫ్రూట్కు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని తెలుసుకుని, సాగుపై అధ్యయనం చేశాను.

50 పాత ప్లాస్టిక్​ డబ్బాలు సేకరించి, వాటిలో మృత్తిక దూర్చి.. సాగు ప్రారంభించాను. ఫలసాయం వచ్చాక కిలోకు రూ.200 విక్రయిస్తున్నాను. నెలకు రూ.లక్ష వరకు ఆర్జిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

మృత్తిక లేకుండా సాగు ఎలాగంటే..
డ్రాగన్ పండ్లు మట్టిలో మాత్రమే బాగా పండుతాయని చెప్పినప్పటికీ, రెమాభాయ్ నిర్భయంగా మిద్దెపై పెంచే సవాల్ ను రెమాభాయ్​​ స్వీకరించింది. 50 పెద్ద ప్లాస్టిక్ బారెళ్లలో కంపోస్ట్‌ పోసి, ఒక్కో డబ్బాలో రెండు మొక్కల చొప్పున నాటారు. ప్రతి డబ్బా అడుగున వృథా నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు చేశారు. రెమాభాయ్ చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఎండిన ఆకులు, ఎముకల పొడి,

బియ్యం నీళ్ల వంటి సహజ సిద్ధమైన పదార్థాలను, మిశ్రమాలను వినియోగిస్తున్నారు. బయట పండించే వారు సాగుకు రసాయనాలు వాడతారని, కానీ.. తాను సేంద్రియ పద్ధతుల్లోనే తోట పండిస్తున్నానని చెప్పుకొచ్చారు. అందుకే.. తాను పండించిన పండ్లు.. మార్కెట్​లో దొరికే పండ్ల కంటే రుచిగా ఉంటాయని ఘంటాపథంగా ఉంటాయని చెప్తున్నారు. ఎవరైనా రెమాభాయ్​ చేస్తున్న సాగు గురించి తెలుసుకోవాలంటే

‘జే.సీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా సందర్శించవచ్చు. ప్రతి మొక్కను తన సొంత బిడ్డలా పెంచుకుంటున్నానని, ప్రస్తుతం అదే తన జీవితమని రెమాభాయ్​ మురిపెంగా చెప్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -