end
=
Tuesday, March 3, 2026
రాజకీయంఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్
- Advertisment -

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

- Advertisment -
- Advertisment -

Supreme Court : తెలంగాణలో ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల (MLA Disqualification) కేసులో సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌(Speaker Gaddam Prasad Kumar)కు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ వ్యవధిలోపు పెండింగ్‌లో ఉన్న అనర్హత అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో, ప్రధాన కేసుల విచారణను కూడా కోర్టు వచ్చే నాలుగు వారాలకు వాయిదా వేసింది. సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ వివాదానికి సంబంధించిన మూడు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి.

తెలంగాణలో పార్టీ మార్పులు, రాజీనామాలు వంటి కారణాలతో ఎమ్మెల్యేలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై జులై 31 తేదీన సుప్రీంకోర్టు మూడు నెలల గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. అయితే వివిధ పరిపాలనా, ప్రక్రియాపరమైన కారణాలతో ఆ గడువులోపు తీర్పు ఇవ్వడం సాధ్యం కాలేదని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. దీంతో, గడువు పొడిగింపునకు సంబంధించిన మిసిలేనియస్ అప్లికేషన్‌ను తెలంగాణ శాసనసభ కార్యదర్శి కోర్టు ముందు దాఖలు చేశారు. ఈ దరఖాస్తు సోమవారం 14వ అంశంగా కోర్టు అజెండాలో చేరింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు అదనంగా రెండు నెలల గడువు ఇవ్వాలని శాసనసభ అభ్యర్థించినప్పటికీ, ధర్మాసనం తుది నిర్ణయంతో కేవలం నాలుగు వారాల గడువునే మంజూరు చేసింది.

ఇదిలా ఉండగా, స్పీకర్ మూడునెలల గడువును పాటించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ 36వ అంశంగా, అలాగే కోర్టే నేరుగా అనర్హత కేసులను విచారించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ 37వ అంశంగా జాబితాలో ఉన్నాయి. ఈ రెండు పిటిషన్లను కూడా ధర్మాసనం అదే రోజు పరిశీలించింది. విచారణ అనంతరం, స్పీకర్ నిర్ణయం తీసుకునే ప్రక్రియను మరింత ఆలస్యం చేయకుండా ఉండేందుకు కోర్టు తదుపరి నాలుగు వారాల వ్యవధిని ఖచ్చితమైన గడువుగా నిర్దేశించింది. ఈ వ్యవధిలోపు అనర్హత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయం ఇవ్వాలని మరోసారి స్పష్టం చేసింది. తదుపరి విచారణను కూడా అదే వ్యవధి ముగిసిన తర్వాత తిరిగి చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -