ఐఏఎస్ ఆమ్రపాలి (IAS Amrapali)ని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ మంగళవారం రాత్రి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) (Central Administration Tribunal) ఉత్తర్వులిచ్చింది. గతంలో ఆమె తెలంగాణ పరిధి (Telangana Cadre) లో జీహెచ్ఎంసీ కమిషనర్ (Former GHMC Commissioner)గా విధులు నిర్వర్తిస్తుండగా, క్యాట్ జోక్యం చేసుకుని ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని నిర్ణయించింది.
దీంతో ఆమ్రపాలి, రొనాల్డ్రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి వంటి ఐఏఎస్లు ఏపీలో విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత వీరిలో ఆమ్రపాలి తనను తెలంగాణ క్యాడర్కే కేటాయించాలని ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ను విచారించిన ట్రిబ్యునల్ తాజాగా అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి తెలంగాణలో సేవలందించనున్నారు.