విమాన ప్రమాద ఘటనా స్థల సందర్శన
సివిల్స్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం(Ahmadabad City)లో జరిగిన విమాన ప్రమాద ఘటన(Flight Crashed) తనను కలచివేసిందని, తన గుండె ముక్కలైందని ప్రధాని మోదీ(Prime minister Modi) పేర్కొన్నారు. ఘటన పెను విషాదమని విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం తనను కలచివేసిందని, బాధితుల బాధ వర్ణించరానిదని తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులు, బంధువులు కోల్పోయిన వారి బాధ వర్ణానాతీతమన్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు శుక్రవారం ఉదయం ఆయన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్స్ ఆసుపత్రి(Civil Hospital)లో ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ ను పరామర్శించారు. సివిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం ప్రధాని మోదీ విజయ్ రూపానీ ఇంటికి వెళ్లారు. విజయ్ రూపానీ మృతికి ప్రగాడ సానుభూతి తెలిపిన మోదీ అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రూపానీ ప్రమాదంలో మరణించారన్న వార్త విని తాను తట్టుకోలేకపోయానని తెలిపారు. రూపానీతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తనకు దశాబ్దాలుగా రూపానీతో మంచి పరిచయం ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం తామిద్దరం పనిచేశామని గుర్తుచేసుకున్నారు. అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో కూడా విజయ్ భాయ్ వినయపూర్వకంగా పనిచేసేవారని తెలిపారు.
పార్టీ సిద్ధాంతానికి ధృడంగా కట్టుబడి ఉండేవారని, ఉన్నత స్థాయికి ఎదిగి, వివిధ బాధ్యతలను నిర్వహించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతో శ్రద్ధాసక్తులతో సేవలందించారని కొనియాడారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో ఉన్నతాధికారులను సమీక్షించారు. ప్రమాదం సంభవించిన తీరుపై ఆరా తీశారు.