end
=
Tuesday, June 17, 2025
వార్తలురాష్ట్రీయంనాలుగోసారి విచారణకు ప్రభాకర్​రావు
- Advertisment -

నాలుగోసారి విచారణకు ప్రభాకర్​రావు

- Advertisment -
- Advertisment -

ఫోన్​ట్యాపింగ్​ కేసులో ఏ1 నిందితుడు, మాజీ  స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచి (ఎస్​ఐబీ) చీఫ్​ ప్రభాకర్​రావు(Ex  SIB chief  Prabhakar rao)మంగళవారం నాలుగోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)(Special investigation team) విచారణకు విచారణకు హాజరయ్యారు. ఈసారి సిట్​ 600 మంది ఫోన్​ట్యాపింగ్(Phone taping)​ ఆడియో క్లిప్పింగ్స్​(Audio clippings) వినిపించి, మరీ ప్రభాకర్​రావును ప్రశ్నించనున్నట్లు సమాచారం.

ఆడియో క్లిప్పింగ్స్​ ఆధారంలో లోతైన విచారణ చేయనున్నట్లు తెలుస్తున్నది. వీరిలో ప్రభుత్వ పెద్దలు, న్యాయమూర్తుల క్లిప్పింగ్స్​ కూడా ఉంటాయని సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి నేతృత్వంలో ఫోన్​ట్యాపింగ్​ జరిగిందనే విషయంపై సిట్​ స్పష్టమైన వాంగ్మూలం తీసుకుంటుందని.. దాన్ని బట్టి ప్రభాకర్​రావును మరికొన్నిసార్లు విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

సాక్షిగా పీసీసీ చీఫ్​ వాంగ్మూలం..

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ మంగళవారం సాక్షిగా విచారణకు హాజరయ్యారు. 2023లో తాను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్నానని, నాడు తన ఫోన్​ కూడా ట్యాప్​ అయిందని ఆయన గతంలోనే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుమేరకు నాడు జూబ్లీహిల్స్​ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగానే పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -