end
=
Monday, June 16, 2025
వార్తలురాష్ట్రీయం25లోపు రైతుభరోసా
- Advertisment -

25లోపు రైతుభరోసా

- Advertisment -
- Advertisment -

తెలంగాణవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెల 25లోపు రైతుభరోసా(Raitu bharosa) సొమ్ము జమ చేసేందుకు సర్కార్​(Telangana Government) సిద్ధమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పర్యటనలో భాగంగా ఆయన రైతుభరోసాపై స్పష్టత ఇచ్చారు.

ఇదే విషయాన్ని తాజాగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti) కూడా ప్రకటించారు. ఒక్కో రైతు ఖాతాలో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని చెప్పారు కానీ, పెండింగ్​లో ఉన్న పెట్టుబడి సాయం జమ చేస్తారా? కొత్తగా ఈ వానాకాలంల సీజన్​ వరకు జమ చేయిస్తారా? అన్నం అంశంపై మాత్రం స్పష్టత లేదు. గత సీజన్​ యాసంగిలో మూడున్నర ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రం రైతుభరోసా అందించింది.

మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు సర్కార్​ మొండిచేయి చూపింది. ఆ సీజన్​ పూర్తయినా ఇప్పటివరకు పెండింగ్​ పెట్టుబడి సాయం అందించలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్​ కూడా వచ్చేసింది. కాబట్టి సర్కార్​ ఈ దఫా పెట్టుబడి కూడా అందించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకటి రెండు రోజుల్లో పెండింగ్ ఉన్న రైతుభరోసా​తోపాటు వానకాలం సీజన్​ పెట్టుబడి సాయంపైనా సర్కార్​ స్పష్టత ఇస్తుందని తెలుస్తున్నది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -