తెలంగాణవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెల 25లోపు రైతుభరోసా(Raitu bharosa) సొమ్ము జమ చేసేందుకు సర్కార్(Telangana Government) సిద్ధమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పర్యటనలో భాగంగా ఆయన రైతుభరోసాపై స్పష్టత ఇచ్చారు.
ఇదే విషయాన్ని తాజాగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Minister Ponguleti) కూడా ప్రకటించారు. ఒక్కో రైతు ఖాతాలో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని చెప్పారు కానీ, పెండింగ్లో ఉన్న పెట్టుబడి సాయం జమ చేస్తారా? కొత్తగా ఈ వానాకాలంల సీజన్ వరకు జమ చేయిస్తారా? అన్నం అంశంపై మాత్రం స్పష్టత లేదు. గత సీజన్ యాసంగిలో మూడున్నర ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రం రైతుభరోసా అందించింది.
మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు సర్కార్ మొండిచేయి చూపింది. ఆ సీజన్ పూర్తయినా ఇప్పటివరకు పెండింగ్ పెట్టుబడి సాయం అందించలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా వచ్చేసింది. కాబట్టి సర్కార్ ఈ దఫా పెట్టుబడి కూడా అందించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకటి రెండు రోజుల్లో పెండింగ్ ఉన్న రైతుభరోసాతోపాటు వానకాలం సీజన్ పెట్టుబడి సాయంపైనా సర్కార్ స్పష్టత ఇస్తుందని తెలుస్తున్నది.