ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఐక్యతతోనే విజయాలు (Unity leads to Success) సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ నేతలు (Congress Party Leaders), కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Redddy) పిలుపునిచ్చారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) రాజకీయ వ్యవహారాల కమిటీ (PCC Political Meeting) సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, ప్రభుత్వం రెండూ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పార్టీ నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు. బూత్, గ్రామ, మండల స్థాయి లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బూత్ స్థాయిలో పార్టీ (Booth Level Strongness) బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్థంగా తీసుకెళ్లగలుగుతామన్నారు. పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి సారించండి..
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నామని, పార్టీ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీల్లో నామినేషన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.రాష్ట్రంలో కులగణన చేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సవాల్ విసిరామని,
కేంద్రం కూడా జనగణనతోపాటు కులగణన చేసే పరిస్థితికి తీసుకువచ్చామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
ఇన్చార్జ్ మంత్రుల పని తీరుపై గరం..
ఇన్చార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. జిల్లాస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయమని బాధ్యతలు అప్పగించినా, ఎవరూ పట్టించుకోవడంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్చార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగంలోనూ మంత్రులు విఫలమవుతున్నారని పేర్కొన్నారు.
తమ సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టాలని సోమవారం గాంధీభవన్లో గొల్ల కురుమలు జీవాలను విడిచిపెట్టి నిరసన వ్యక్తం చేయడంపై సీఎం సీరియస్ అయ్యారు. నిరసన తెలపడానికి కూడా ఒక పరిమితి ఉంటుందని, ఇష్టారీతిన నిరసనలు చేయడం సరికాదన్నారు.