end
=
Tuesday, June 24, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌నడిచే గ్రంథాలయాలున్నాయ్​.. వాటిని చూశారా?
- Advertisment -

నడిచే గ్రంథాలయాలున్నాయ్​.. వాటిని చూశారా?

- Advertisment -
- Advertisment -

గ్రంథాలయాలు పుస్తక గనులు (Libraries are Mines of books) .. మనిషి మస్తిష్కాల(Human Minds)ను వికసింప జేసే నిధులు.. గ్రంథాలయం ఎక్కడ ఉంటే అక్కడ మేధా వికాసానికి పునాదులు (Base of Human Intellegnece) పడతాయి. చిన్నారులు వాటిపై తమ భవిష్యత్తుకు బంగారు బాటలు (Golden way to Future) వేసుకునే అవకాశం ఉంటుంది.

సాంకేతికత ఎంత పెరిగినా, అర్టీఫిషియల్​ ఇంటెలిజెన్సీ వచ్చేసినా పుస్తకం విలువ పుస్తకానిదే. ఒక్కసారి బుక్​ తెరిచి ఒక్కో అక్షరం.. ఒక్కో పదం చదువుతుంటే మనలో ఒక్కో విజ్ఞాన ద్వారం తెరుచుకుంటుంది.

పుస్తకంలో ఉన్న విషయాలు, దృశ్యాలన్నీ మన మనోఫలకంలో ప్రతిబింబిస్తాయి. బుక్​ ప్రాధాన్యాన్ని గుర్తించిన కొందరు నేటి తరానికి వాటిని చేరువ చేసేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అసలు దుకాణాలే లేని ప్రదేశాలు, మైదాన ప్రాంతాలే కాక ఎడారి ప్రాంతాలు, మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలకు పుస్తకాలను తీసుకెళ్తున్నారు. గూగుల్​ సేవలు అందని చోట కూడా ఆ సేవలు అందిస్తున్నారు. అలాంటి వారి గురించే ఈ కథనం.

ఉత్తరాఖండ్​లో ఘోడా లైబ్రరీ..
ఉత్తరాఖండ్ కు చెందిన యువకులు‘ ఘోడా’ లైబ్రరీని అనే కాన్సెప్ట్​ను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఎక్కువ కనుక వీరు ఒక గుర్రాన్ని కొనుగోలు చేశారు. గుర్రం మోయగలిగినన్ని పుస్తకాలు వాటిని కట్టి ఊరూరా తిప్పుతున్నారు. గ్రామాల్లో పిల్లలు ఆ గుర్రాన్ని చూడటానికైనా అక్కడి వస్తున్నారు. ఇష్టంగా తమకు నచ్చిన పుస్తకాలు తీసుకుని చదువుతున్నారు. నిర్వాహకులు పిల్లలకు ఉచితంగా కూడా పుస్తకాలు అందజేస్తున్నారు.

రాజస్థాన్​లో ఒంటె లైబ్రరీ
రాజస్థాన్‌కు చెందిన కొందరు యువత ఒంటె బండిని సిద్ధం చేసి, వాటిలో పుస్తకాలు ఉంచుతున్నారు. ఆ ఒంటె బండి ప్రతిరోజూ ఊరూరా తిరుగుతుంది. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ప్రయాణిస్తుంది. అలా వందలాది కథల పుస్తకాలు పిల్లలకు చేరువ అవుతున్నాయి. స్థానిక స్వచ్ఛంద సేవ సంస్థలు యువతకు సహకరిస్తున్నారు. రీడింగ్ సర్కిళ్లు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు పాఠ్య పుస్తకాలే కాక, ఇతర పుస్తకాలు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు.

థానేలో మొబైల్ లైబ్రరీ
ముంబైలోని థానేలో మరాఠీ గ్రంథ్ సంఘరాలయ అనే సంస్థ మొబైల్ లైబ్రరీ నడుపుతున్నది. లైబ్రరీని పిల్లలతో పాటు సీనియర్ సిటిజన్లకు నేరుగా పుస్తకాలను అందిస్తున్నది. సంస్థ ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో 10,000 కంటే ఎక్కువ పుస్తకాలు సేకరించింది. ఇప్పుడు.. అప్పుడు అని కాకుండా, వారమంతా లెబ్రరీ సేవలు ఉంటాయి. వాహనం ప్రతి స్టాప్ వద్ద దాదాపు గంటన్నర నిలిచి ఉంటుంది.

పాఠకులు నెలకు కేవలం రూ.100 చెల్లించి పుస్తకాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈమొబైల్​ లైబ్రరీ మహారాష్ట్రలో చాలా ఫేమస్​. ప్రస్తుతం ఈ మొబైల్​ లైబ్రరీలో 1,100 మంది సభ్యులు ఉండగా, వీరిలో 450 మంది పిల్లలే కావడం విశేషం.

ఢిల్లీ మొబైల్ లైబ్రరీ సర్వీస్
దేశ రాజధానిలో 1953 నుంచి ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ సంస్థ మొబైల్ లైబ్రరీ సేవలు నిర్వహిస్తోంది. ఈ వాహనం రాజధాని అంతటా తిరుగుతుంది. మొదట్లో ఒక వాహనం ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇవి ప్రతిరోజు తక్కువలో తక్కువ 70 ప్రదేశాలు తిరుగుతాయి. సంస్థ పరిధిలో 6,000 కంటే ఎక్కువ మంది పాఠకులు ఉన్నారు. అలాగే బెంగళూరులో బిలియన్ లిటరేట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో మొబైల్​ లైబ్రరీ నడుస్తున్నది.

ఈ మొబైల్ లైబ్రరీలు అద్భుతంగా కనిపించకపోవచ్చు, కానీ, ఉన్నంతలో శక్తివంతమైన పనిని చేస్తున్నాయి, పుస్తకాలు అవసరమైన పిల్లలకు వాటిని తీసుకువెళుతున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -