end
=
Sunday, June 15, 2025
రాజకీయంకేసీఆర్ ఏం చెప్తారు ?
- Advertisment -

కేసీఆర్ ఏం చెప్తారు ?

- Advertisment -
- Advertisment -

మరికొద్ది సేపట్లో ఘోష్ కమిషన్ ఎదుటకు మాజీ సీఎం

కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleswaram Project) నిర్మాణంలో అవకతవకలు, బరాజ్ కుంగుబాటు వెనుక కారణాలు తెలుసుకునేందుకే ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​(Ex Cm KCR)ను విచారించనున్నది. హైదరాబాద్​లోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవనంలో కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్ విచారణకు హాజరయ్యే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు(Brs Leaders) భారీగా బీఆర్ కే భవన్ వద్ద మోహరించే అవకాశం ఉంది.

విచారణకు ఏమైనా అడ్డంకులు వస్తే కమిషన్​ ఇన్​ కెమెరాలో కేసీఆర్​ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు కమిషన్​ కేసీఆర్ కు​ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది? ఆయన ఏ రీతిలో సమాధానాలు చెప్తారు? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కేసీఆర్ అంతా తేలిగ్గా కమిషర్​ సమాధానాలు ఇవ్వరని, విచారణను మరింత సంక్లిష్టపరిచే విధంగా ఆయన సమాధానాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఎర్రవల్లి ఫాం హౌస్​ లో మరోసారి కేసీఆర్ ను​ కలిశారు. విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏ విధంగా చెప్తే బాగుంటుందనే అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. కమిషన్ ఎదుట విచారణకు ఇప్పటికే నాటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.

విచారణ తర్వాత వారు బయటకు వచ్చి తాము అంతా నిజమే చెప్పామని, తాము ఏదీ దాచిపెట్టలేదని మీడియాతో చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ విచారణ తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -