end
=
Tuesday, December 2, 2025
సినీమామెగాస్టార్‌తో జోడీ కట్టనున్న యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్
- Advertisment -

మెగాస్టార్‌తో జోడీ కట్టనున్న యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్

- Advertisment -
- Advertisment -

Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)మళ్లీ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) (Bobby Kolli)తో చేతులు కలపనుండటంతో టాలీవుడ్‌లో మంచి హైప్ నెలకొంది. అభిమానుల ఎదురుచూపులకు తెరదించేందుకు ఈ క్రేజీ కాంబో మరోసారి తెరపైకి రాబోతున్న exciting సినిమా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నవంబర్ 5న ఈ ప్రాజెక్ట్‌ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. చిరంజీవి ఫ్యాన్స్‌కు ఇష్టమైన స్టైల్‌లో యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ గతంలో చిరంజీవికి పూర్తిగా సరిపోయే మాస్ రోల్‌ను డిజైన్ చేసి, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందించిన నేపథ్యంలో ఈ కాంబోపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటించనుందని సమాచారం. మాళవిక ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా, గతంలో ‘తంగలాన్’ చిత్రంలో విక్రమ్‌తో, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి పనిచేసి మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఇప్పుడు చిరంజీవి సరసన నటించే అవకాశం రావడంతో ఆమెకు ఇది మరో మెజర్ బ్రేక్‌గా మారే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుండగా, టెక్నికల్ విభాగం విషయంలోనూ ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉండనుంది. ఇటీవల ‘మిరాయ్’ వంటి విజువల్‌గా రిచ్ సినిమాను రూపొందించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. ఆయ‌న టెక్నికల్ నైపుణ్యం ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్ లుక్‌తో ప్రెజెంట్ చేయడంలో కీలకంగా మారనుంది.

ఈ కొత్త ప్రాజెక్ట్‌ను చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించడం విశేషం. అప్పటినుంచి మెగా అభిమానులలో ఈ సినిమా గురించి భారీ అంచనాలు మొదలయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే మరోసారి చిరంజీవి బాబీ మాస్ ఫెస్టివల్‌ను తెరపై అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. యువ దర్శకుడు వసిష్ఠతో ‘విశ్వంభర’ చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, మరోవైపు అనిల్ రావిపూడితో చేస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వీటికి తోడు బాబీ దర్శకత్వంలో మూడో ప్రాజెక్ట్‌ను షురూ చేయడం చిరంజీవి స్పీడ్‌, కంటిన్యూస్‌ మాస్ అప్పీల్‌కు నిదర్శనం. మొత్తానికి, చిరంజీవి బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మరో మాస్ ఫెస్టివల్‌గా మారే ఛాన్సుంది. నవంబర్ 5న లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -