end
Wednesday, April 29, 2026
వార్తలుఅంతర్జాతీయంElon Musk:ఉద్యోగులకు ట్విట్టర్ సీఈవో షాక్
- Advertisment -

Elon Musk:ఉద్యోగులకు ట్విట్టర్ సీఈవో షాక్

- Advertisment -
- Advertisment -
  • వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన
  • ఆఫీసులోనే విధులు నిర్వర్తించాలని ఆదేశం

టెస్లా సీఈవో (Tesla CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ (Twitter) యాజమాన్య బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉద్యోగులకు మరో షాకిచ్చారు. ట్విట్టర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ (Whf) విధానాన్ని రద్దు (Cancel) చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు (office)రావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు లేఖ (Letter) రాశారు. కరోనా సమయంలో ట్విట్టర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశారని ఎలాన్ మస్క్ తెలిపారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలన్నారు.

ఈ మేరకు ఉద్యోగులు కనీసం వారానికి 40 గంటల (40 hours) పాటు ఆఫీసులో తప్పనిసరిగా పనిచేయాలని ఆదేశించారు. ట్విట్టర్ సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఎలాన్ మస్క్ అన్నారు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికైనా ఆఫీసులకు వచ్చేందుకు ఇబ్బందిగా అనిపిస్తే రాజీనామా (Resign) చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ సహ ఉద్యోగులు ఉన్న దగ్గర నివసించాలన్నారు. టెస్లా, స్పెస్ ఎక్స్ (Tesla, SpaceX) సంస్థల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కఠిన (Rules) నిబంధల అమలు చేస్తున్నందు వల్లే ఈ రెండు సంస్థలు నెంబర్ వన్‌గా ఉన్నాయని చెప్పారు. లేదంటే ఎప్పుడో దివాళా తీసి ఉండేవని తెలిపారు.

(Mamata Banerjee:నేను ప్రధాని కాళ్లపై పడాలా?)

మరోవైపు ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రోజూ ఆ సంస్థ వార్తలో నిలుస్తోంది. ఆయన తీసుకంటున్న పలు నిర్ణయాలు (Decisions) వివాదస్పదం అవుతున్నాయి. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోనికి సింక్‌తో ప్రవేశించి.. సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపు మొదలు బ్లూటిక్ (Blue Tick) వరకు ఎలాన్ మస్క్ నిర్ణయాలు అన్ని పలు వివాదాలకు దారితీస్తూనే ఉన్నాయి. ఏకంగా ట్విట్టర్ సీఈవోనే బాధ్యతల నుంచి తొలగించారు. అలాగే అనేక ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు. తాజాగా ట్విట్టర్ (Bluetick Subscription) విషయం వివాదానికి కారణమైంది. దీంతో ట్విట్టర్ వినియోగదారుల భద్రతకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఈ విషయంలో ట్విట్టర్ వెనక్కి తగ్గింది. అంతేకాదు ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసు (Premium service) గా మార్చారు ఎలాన్‌ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు (Monthly charges) ప్రకటించారు. దీనివల్ల నకిలీ ఖాతాలు ఎక్కువుగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేశారు. ప్రముఖ కంపెనీలు, వ్యక్తుల పేరుతో ట్విట్టర్ ఖాతాలు సృష్టించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడంతో అసలు, నకిలీ ఖాతాలు గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఈ విషయంలో సంస్థ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ఎలన్ మస్క్ తక్షణ నిర్ణయాల పట్ల ఉద్యోగులు, వినియోగదారులు ఆసంప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -