నలుగురు మృతి.. 51 మందికి గాయాలు
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇండోరి తలేగావ్(Indori Talegav Area) ప్రాంతంలోని ఇంద్రాయణి నది(Indrayani River)పై ఉన్న పాత వంతెన కూలి (Old bridge collapsed)నలుగురు మృతిచెందారు(Four people died). 51 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం ఉదయం సంభవించింది. పుణెలో రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో నగర శివారులోని శిథిలావస్థలో ఉన్న వంతెన కూలింది. కూలిన సమయంలో వంతెనపై ఉన్న 100 మందికి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా నదిలో పడిపోయారు. వీరిలో నలుగురు నదిలో గల్లంతై ప్రాణాలు విడిచారు. మరికొంత మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. వంతెనపై నుంచి కిందపడటంతో కింద రాళ్లు తగిలి 51 మంది స్థానికులు గాయాలపాలయ్యారు. వంతెన కూలిన ప్రాంతం పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడి పర్యాటకులు భారీగా తరలివచ్చారని,
ఆ ప్రాంతంలోని వంతెన ఎంతో పురాతనమైంది కావడం, వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అది కూలిందని స్థానికులు చెప్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోవైపు సహాయక చర్యలపై సీఎంను ఆరా తీశారు. వంతెన ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్మీడియాలో స్పందిచారు.
వంతెన కూలిపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.