విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Varsatille actor Vijay sethupathi) కథనాయకుడిగా డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Director Puri Jagannath) దర్శకత్వంలో త్వరలో సినిమా ప్రారంభం కానున్నది. పాన్-ఇండియా ప్రాజెక్ట్(Pan indian project)గా చిత్రం తెరకెక్కనున్నది. పూరి కనెక్ట్స్ బ్యానర్(Puri connects banner)పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
సినిమాలో నటించనున్న నటీనటుల వివరాలను చిత్ర బృందం ఒక్కొక్కరిగా బయటపెడతున్నది. సేతుపతితో తలపడే విలన్గా కన్నడ స్టార్ దునియా విజయ్కుమార్, కీలక పాత్రధారణిగా హైదరాబాదీ టబు పేర్లను ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మరో హీరోయిన్ను పేరు బయటకు వచ్చింది. మేకర్స్ ఇప్పుడు మరో అందాల భామ ఈ ప్రాజెక్టులో అడుగుపెడుతున్నట్టు తెలియజేశారు.
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, చిత్రంలో ఆమెది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదని, ఆమె పాత్ర కథనంలో కీలకంగా ఉంటుందని టీమ్ తెలిపింది.
ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉండే పాత్రలో కనిపించనున్నందున కథ పట్ల, ఇందులో తన పాత్ర పట్ల సంయుక్త చాలా థ్రిల్ అయ్యిందట. ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారా? అన్న ఉత్సాహం ప్రదర్శిస్తోందట సంయుక్త మీనన్. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ స్పాట్స్ కోసం ఇప్పటికే టీం రెక్కీ పూర్తి చేసింది. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.