ప్రాజెక్ట్ పనులను అడ్డుకోండి..
కేంద్ర జల్శక్తి మంత్రి పాటిల్కు సీఎం రేవంత్ వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) అన్యాయంగా గోదావరి (Godavari River)పై బనకచర్ల ప్రాజెక్ట్ (Banakcharla project) నిర్మిస్తున్నదని, ఆ ప్రాజెక్టును అడ్డకోవాల్సిందేనని, కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి (TG CM Revanth Reddy)కోరారు. గురువారం ఆయన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు.
అక్కడ కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ (Central Minister CR Patil)ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై రూపొందించిన రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నడచుకుంటున్నదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు విషయంలో తెలంగాణ రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.
వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్తుందని, అది నిజం కాదన్నారు. జల్శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని వెల్లడించారు.
పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగుతున్నాయన్నారు.