రాష్ట్రం (Telangana State)లో కొత్త రేషన్కార్డుల(New Ration Cards) కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త (Good News). ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) చేతులమీదుగా కొత్త రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం(Will be Start) చుట్టనున్నారు. మొత్తంగా 2.4 లక్షల కొత్త రేషన్కార్డులు పంపిణీ చేయనుండగా, వీటివల్ల సుమారు 11.30 లక్షల మందికి కొత్తగా రేషన్ సరఫరా అందనుంది.
ఇప్పటికే గత ఆరు నెలల్లో 41 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరయ్యాయి. తాజా పంపిణీతో కలిపి రాష్ట్రంలో రేషన్కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుకోనుంది. మొత్తంగా 3.14 కోట్ల మంది ప్రజలకు రేషన్ సరఫరా కొనసాగనుంది. అర్హులైన వారికి త్వరలోనే కార్డులు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.